Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దిష్టిబొమ్మ తీసుకెళ్లిన పోలీసులు
హైవేపై పెద్ద ఎత్తున ఆందోళన
నవతెలంగాణ-శంషాబాద్
కాంగ్రెస్ ఆధ్వర్యంలో మొన్న చేపట్టిన నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంది. దీనికి నిరసనగా ఆదివారం శంషాబాద్లో కాంగ్రెస్ ఆధ్వ ్యంలో శంషాబాద్ జాతీయ రహదారి 44పై నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం అడ్డుకునే ఉద్దేశంతో పోలీసులు కాంగ్రెస్ నాయకుల వద్ద ఉ న్న కేసీఆర్ దిష్టిబొమ్మను తీసుకొని పరుగు పెట్టారు. గమనించిన కాంగ్రెస్ నాయకులు వెంబడించి పెద్ద ఎత్తున నినాదాలతో నాయకులు దిష్టిబొమ్మను పోలీసుల నుంచి లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ రసాభసలో దిష్టి బొమ్మ పూర్తిగా చిరిగిపోయింది. కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ది మరో దిష్టిబొమ్మ తీసుకువచ్చి శంషాబాద్, తొండుపల్లిలో దహనం చేశారు. సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పిల్లనగ్రోవిల సంజరు యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిరంకుశ ధోరణి ఖండిస్తున్నామని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏడున్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులతో దిష్టిబొమ్మ దహనం చేస్తుంటే పోలీసులు అడ్డుకో వడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిందని నిరుద్యోగులకు ఉద్యోగాలు నోటిఫికేషన్ వేయాలని ఏండ్ల తరబడి నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేసే సత్తా కేసీఆర్కు లేదా అంటూ ప్రశ్నించారు. తెలం గాణ ముఖ్యమంత్రి ప్రతిపక్షాల గొంతు నొక్కడం మానుకొని నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం శేఖర్యాదవ్, మైలారం సులోచన, శ్రీధర్యాదవ్, బొబ్బిలి కృష్ణ, బొబ్బిలి చంద్రశేఖర్, మాజీ ఉపసర్పంచ్ షంషుద్దీన్, సిహెచ్ శేఖర్, నజీర్, ప్రవీణ్, సంజీవ్రెడ్డి, గణేష్ నాయక్, గన్ని బారు, మహేష్ ముది రాజ్, రఘు, ప్రభాకర్, చిరంజీవి, నరేందర్, చందు, అంకిత్ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.