Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కూకట్పల్లి
వివేకానందనగర్ డివిజన్ పరిధిలో కార్పొరేటర్ మాధవరం రోజదేవి ఆదేశాల మేరకు మాధవరం కాలనీ, దీనబంధు కాలనీ వాసులకు నాళా దగ్గర బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ఇబ్బందులు కలగకుండా బతు కమ్మ కుంటల మరమ్మతు పనులను సోమవారం ఆల్విన్ కాలనీ ఫేస్ వన్ మెయిన్ రోడ్డులో నూతనంగా నిర్మించిన బతుకమ్మ కుంటను మాజీ కార్పొరేటర్ మాధవరం రంగా రావు పరిశీలించారు. అనంతరం వెంకటేశ్వరనగర్ పీజేఆర్ ఫంక్షన్ హాల్ వద్ద మంజూరైన బతుకమ్మకుంటను త్వరగా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వర్క్ ఇన్స్పెక్టర్కు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ సుధాకర్, సూపర్వైజర్ బద్రయ్య, మల్లేష్, ఆంజనేయులు, కిషన్రావు, చలపతిరావు, వెంకట్రెడ్డి, బి.శ్రీనివాస్, చంద్రయ్య, నరేష్, రమేష్, సాయి, తదితరులు పాల్గొన్నారు.