Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
పర్యావరణ సమతుల్యతకు హరితహారం దోహదం చేస్తుందనీ, చెట్లు స్వచ్ఛమైన ప్రాణవాయువును అందిస్తాయ ని కార్పొరేటర్ అన్నారు. అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చ బొల్లారం డివిజన్ హెచ్ఎంటీ ఆఫీసర్స్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అల్వాల్ ఉప కమిషనర్ నాగమణితో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఆర్టికల్చర్ అధికారి నవీన్, ఎలక్ట్రికల్ ఏఈ స్వాతి, స్థానిక కాలనీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్రావు, శ్రీనివాస్, రమేష్రావు, శ్రీనివాసరావు, రామారావు, రాజిరెడ్డి, డివిజన్ అధ్యక్షులు బొబ్బిలి సురేందర్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, శ్రీశైలం యాదవ్, కొండల్రెడ్డి, రమేష్, అతిక్ పాష, దేవిక, తులసి, సులోచన, తదితరులు పాల్గొన్నారు.