Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి సర్కిల్ గౌతమ్నగర్ డివిజన్ పరిధిలోని ఐఎన్నగర్లో సోమవారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు గౌతమ్నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీతరాముయాదవ్తో కలిసి బతుకమ్మ చీరలను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 6వ తేదీ నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం అవుతుండటంతో పండుగ, నవరాత్రి ఉత్సవాల తోపాటు, 9 రోజులపాటు బతుకమ్మ పండగును రాష్ట్ర ప్రజ లు నిర్వహిస్తారనీ, అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి యేటా మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తుం దన్నారు. ఈ సారి బతుకమ్మ 19 రంగులు, 17 డిజైన్లతో, 290 వర్ణాలతో, రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను ప్రత్యేక శ్రద్ధతో తయారు చేసినట్టు తెలిపారు. 2017 నుంచి 18 ఏండ్లు పై బడిన, ఆహారభద్రత కార్డు కింద నమోదైన మహి ళలకు ఈ చీరలను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆనంద్బాగ్ డివిజన్ కార్పొరేటర్ వై.ప్రేమ్కుమార్, మాజీ కార్పొరేటర్ జగదీష్గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాము యాదవ్, పిట్ల శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.