Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
డంపింగ్ యార్డులో పని చేస్తున్న కేవీఆర్ యూనియన్ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్స్ను పరిష్కరించి వెంటనే వేతన ఒప్పందం చేయాలని కంపెనీ గేట్ దగ్గర నిరసన, నినాదాలు చేశారు. వేతన ఒప్పందం 2020 జూన్తో ముగిసిపోయిందనీ, కొత్త ఒప్పందం జులై 2020 నుంచి అమలు కావాల్సి ఉన్నా యాజమాన్యం 15 నెలలు గడుస్తున్నా నేటికీ చేయలేద న్నారు. నిరంతరం చెత్తలో పనిచేస్తూ అనారోగ్యం బారిన పడుతున్నా సంస్థ అభివృద్ధికి పాటుపడుతున్నా మని తెలిపారు. సరైన భద్రత, క్యాంటీన్ వ్యవస్థ లేదన్నారు. పదేండ్లుగా పని చేస్తున్నా కనీస వేతనాలకు నోచుకోవడం లేదన్నారు. తమ న్యాయమైన డిమాండ్స్ ను పరిష్కరించి వేతన ఒప్పంద చేయాలని అడుగు తుంటే యాజమాన్యం వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతన ఒప్పందం వెంటనే చేయకపోతే పోరాటం ఉదృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. సంస్థలో పని చేస్తున్న కార్మికులందరికీ జీతాలు పెంచి యూనియన్ కార్మికు లకు పెంచడం లేదనీ, యూనియన్ కార్మికుల పట్ల వివక్ష సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి వి.సురేష్, చిప్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ నాయక్, హరినాథ్, నర్సింహులు, సుభాన్, రత్నం, బాలాజీసింగ్, రామకృష్ణ పాల్గొన్నారు.