Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్నగర్
పెండింగ్లో ఉన్న రూ.3,300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హిమాయత్నగర్లోని సత్యనారాయణరెడ్డి భవన్లో ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు గోలి హరికృష్ణ, కార్యదర్శి గ్యార నరేష్ మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం పూర్తిగా నిర్వీర్యం అయిందన్నారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పిన ప్రభుత్వం దాదాపు 40 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసి వేసి ఉన్నత విద్యకు అరకొర నిధులు కేటాయించి పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యను దూరం చేస్తుందన్నారు. పెండింగ్లో ఉన్న రూ.3,300 కోట్ల స్కాలర్షిప్లు ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించలేదని ఆరోపించారు. తద్వారా దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు, పై చదువులకు వెళ్లలేక, ఉద్యోగాలు చేయలేక కాలేజీ యాజమాన్యాల దగ్గర తమ సర్టిఫికెట్లను తీసుకోలేక నిరాశ చెందిన కొంత మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు కట్టే పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్ర బడ్జెట్లో బడ్జెట్ కేటాయించినప్పటికీ చెల్లించే విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. పూజలు, పునస్కారాలు, యాగాల పేర్లతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని వథా చేస్తున్న ప్రభుత్వం సమాజ అభివృద్ధికి తోడ్పడే విద్యా రంగానికి న్యాయం చేయలేక పోతుందన్నారు. మేడిన్ ఇండియా, బంగారు తెలంగాణ అని చెప్పుకునే ప్రభుత్వాలు మాత్రం భావితరాలకు బాటలు వేసే విద్యార్థులను విద్యకు దూరం చేస్తుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ను విడుదల చేసి విద్యా రంగాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ చైతన్య యాదవ్, గర్ల్స్ కన్వీనర్ స్వప్న, సహాయ కార్యదర్శి రఘు, నాయకులు శ్రీమన్, విప్లవ్ తదితరులు పాల్గొన్నారు.