Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హౌస్ సర్జన్లు, పోస్టుగ్రాడ్యుయేట్ విద్యార్థులకు విస్తృతమైన అనుభవాన్ని, కార్పొరేట్ శిక్షణను అందించే ఉద్దేశంతో తాము శ్రీలక్ష్మీ గాయత్రి ఆస్పత్రి ప్రయివేట్ లిమిటెడ్(ఎస్ఎల్జీ)తో ఒప్పందం చేసుకున్నట్టు మహేశ్వర మెడికల్ కాలేజి, ఆస్పత్రి వైస్ చైర్మెన్ కీర్తి మహేష్ తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులు ప్రాథమికంగా టీచింగ్ ఆస్పత్రికి, కార్పొరేట్ ఆస్పత్రికి మధ్య తేడాలు తెలుసుకుంటారని, తర్వాత ఎస్ఎల్జీ ఆస్పత్రి ప్రాంగణంలో రోగులకు చికిత్స అందించడంలో అనుభవం పొందుతారని చెప్పారు. వైద్యరంగంలోకి కొత్తగా వస్తున్నవారికి అవగాహన కల్పించడం, వివిధ ప్రాంతాలకు చెందిన పలు రకాల రోగులు ఆస్పత్రికి అనేక వ్యాధులతో వచ్చినప్పుడు అప్పటికప్పుడే నిర్ణయం తీసుకోవడం, వైద్యవృత్తిలో వివిధ పద్ధతులలో ఉండే చికిత్సా విధానాలపై వారు దృష్టి కేంద్రీకరించేలా చేయడమే ఈ శిక్షణ కార్యక్రమం ఉద్దేశమన్నారు.