Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
దమ్మాయిగూడలో శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ తొమ్మిది నెలల క్రితం శ్మశాన వాటిక ఏర్పాటు చేస్తామని కౌన్సిల్ తీర్మానం చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంలో అర్థం ఏంటని ప్రశ్నించారు. శ్మశాన వాటికకు తక్షణమే అధికారికంగా స్థలం కేటాయించి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ స్వామికి వినతిపత్రం అందజేశారు. దాసరి నరసింహరెడ్డి, ప్రసాద్గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా కార్యక్రమంలో టీఆర్ఎస్ కౌన్సిలర్ రామారం శ్రీహరిగౌడ్, యువ నాయకుడు సురేష్, కాంగ్రెస్ కౌన్సిలర్లు గోగుల సరిత వెంకటేష్, వరగంటి వెంకటేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్ప రామారావు, కార్యనిర్వాహక అధ్యక్షుడు సామల శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఏనుగు సంజీవరెడ్డి, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి మెరుగు సునీత, తదితరులు పాల్గొన్నారు.