Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డేర్ టు డ్రీిమ్గా ఎంపికైన ప్రొ.శిరీష
ప్రిన్సిపల్ కనకదుర్గ
నవతెలంగాణ-బడంగ్పేట్
భారత దేశ మాజీ రాష్ట్రపతి డా.ఏపీజే అబ్దుల్ కలాం గుర్తుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడిచే ప్రారంభించబడిన ఆత్మ నిర్బర్ పథకంలో భాగంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చొరవతో డేర్ టు డ్రీమ్ 2.0(2020)పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో జాతీయ స్థాయిలో దేశం నలుమూలల నుండి 1965 మంది యువ శాస్త్రవేత్తలు తమ స్టార్ట్ అప్లను ఆవిష్కరణలో ''డేర్ టు డ్రీమ్ 2.0'' లో ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మెరిసిందని కళాశాల ప్రిన్సిపల్ కనకదుర్గ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ప్రిన్సిపల్ మాట్లాడుతూ మా కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ శిరీష దగ్గుబాటి గౌరవప్రదమైన ప్రధాని ప్రకటించిన ''డేర్ టు డ్రీమ్ 2.0'' ఆవిష్కరణ పోటీలో విజేతగా ఎంపికయ్యారని తెలిపారు. 20మంది వ్యక్తి గత విభాగంలో ఎంపిక చేశారని, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం జ్ఞాపకార్థం గౌరవనీయులైన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అక్టోబర్ 04న న్యూఢిల్లీలో డిఫెన్స్ రీసెర్చ్, డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్ డీఓ) పోటీలో 'డేర్ టు డ్రీమ్ 2.0' విజేతలను సన్మానించి, ప్రశంసా పత్రాలను అందచేయటం జరిగిందని తెలిపారు. ఎంవిఎస్ అర్ ఇంజనీరింగ్ కళాశాలలో క్యాంప్ సైన్స్ విభాగంలో పనిచేస్తున్న డా.శిరీషకు వ్యక్తి గత విభాగంలో ప్రశంసా పత్రం అందజేశారని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపికైన ఏకైక శాస్త్రవేతగా డా.శిరీష నిలువటం గర్వకారణంగా ఉందన్నారు. ఈ ప్రశంసా పత్రం వెనుక తన ఐటిఆర్ ప్రాజెక్టు టీంలోని ప్రొ.కె.ఎస్ఆర్.మూర్తి, ప్రొ.ప్రసన్న కుమార్, ప్రొ.సంధ్యతో పాటు కళాశాల సంపూర్ణ సహకారం ఉందన్నారు.