Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
అకారణంగా చనిపోయిన రాహుల్ కుటుంబాన్ని అన్ని విదాలుగా ఆదుకుంటా మని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అల్మాస్గూడ గ్రామంలోని దశరథ్ నాయక్ కుమారుడు, రాహుల్ నాయక్ అకారణంగా పరమపదించారని తెలిసి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అయన భౌతిక కాయానికి నివాళులు అర్పించి శోకసంద్రంలో మునిగి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని విధాలుగా కుటుంబాన్ని అదుకోవటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, నాయకులు శేఖర్ రెడ్డి, తుపాన్ రెడ్డి, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.