Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
హస్తినాపురం డివిజన్ టీి.ఆర్.ఎస్ పార్టీ ఉపాధ్యక్షులుగా సీనియర్ నాయకులు బోయపల్లి శ్రీరాములు గౌడ్ను స్థానిక ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సూచనల మేరకు మాజీ కార్పొరేటర్ పద్మ శ్రీనివాస్ నాయక్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన ఎమ్మెల్యే సుధీర్రెడ్డికి మరియు మాజీ కార్పొరేటర్ పద్మశ్రీను నాయక్, డివిజన్ అధ్యక్షులు అందోజు సత్యంచారిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డివిజన్లో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి యువతతో మమేకమై సమన్వయంతో అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని వారు అన్నారు. ఉపాధ్యక్షుడిగా తనపై బాధ్యత మరింత పెరిగిందని పార్టీలో కష్టపడే వారిని గుర్తించి అవకాశం ఇవ్వడం వలన విధేయతతో ఎమ్మెల్యే నాయకత్వలో పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తామని వారు అన్నారు. తనకు సహకరించిన టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రఘుమారెడ్డి, నారగోని శ్రీనివాస్ యాదవ్, సయీద్ పాషా, నాగేశ్వరరావు, చంద్రమౌళి చారిలకు శ్రీరాములు గౌడ్ కతజ్ఞతలు తెలిపారు.