Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
శాంతికి చిహ్నమైన మహరాజ్ అగ్రసేన్ జయంతి వేడుకలను బుధవారం తెలంగాణ అగర్వాల్ సమాజం వారు కంటోన్మెంట్ బాలం రాయిరాయ క్లాసిక్ గార్డెన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రసేన్ జయంతితోపాటు యువ ఫన్ ఫిస్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో యువతీ, యువకులు పాల్గొని సృజనాత్మక ఆలోచనతో వారు తయారు చేసిన ఉత్ప త్తులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాంకేతిక విద్యా కళాశాల కమిషనర్ నవీన్ మిట్టల్ హాజరై తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చే వ్యక్తులుగా ఎదగాలన్నారు. దేశంలో అపారమైన ప్రతిభ గల యువ తకు కొదువలేదనీ, వారికి సరైన వనరులు, మార్గదర్శ కత్వం మంచి వాతావరణాన్ని అందించడం పాతతరం బాధ్యత అన్నారు. దేశప్రగతిలో యువత క్రియాశీలక పాత్ర పోషించాలని సూచించారు. అభివృద్ధి, ఆధునికతలో మరింత పురోగమించాలనీ, ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టుకుని దేశ అభివృద్ధికి దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పారు. భారత్ నిర్మాణం యువతపైనే ఉందన్నారు. తమ ప్రతిభకు పదును పెట్టి ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో తెలం గాణ అగర్వాల్ సమాజ్ అధ్యక్షులు అంజనీకుమార్ అగర్వా ల్, నాయకులు అంకిత్ గుప్తా, ఆశిష్ దోచనీయ, నవీన్ అగర్వాల్, సూర్య కమల్ గుప్తా, సందేశ్ అగర్వాల్, రాహు ల్ సింఘాల్, రితీష్ జిగ్నాని, రింకు అగర్వాల్ పాల్గొన్నారు.