Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వక్ఫ్ భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితుల ఆవేదన
నవతెలంగాణ-బోడుప్పల్
పిల్లల పెండ్లిళ్లకో, ఉన్నత చదువులకో ఉపయోగపడు తుందని దశాబ్దాల కిందట ప్లాట్లు కొన్న తమకు రిజిస్ట్రేషన్ శాఖ తీసుకున్న నిర్ణయంతో అన్యాయం జరుగుతోందనీ, వక్ఫ్ భూముల పేరుతో తమపై పెత్తనం ఎందుకు చేస్తున్నారని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వక్ఫ్ భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు వాపోతున్నారు. గతేడాది జరిగిన ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు వక్ఫ్ భూముల సమస్యకు పరిష్కారం చూపు తామని చెప్పిన మాటలను నమ్మి పూర్తిగా మోసపోయా మని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ సర్కిల్ వద్ద వివిధ కాలనీలకు చెందిన వక్ఫ్ భూముల బాధితుల అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు బాధితులకు మద్దతు పలికారు. సమస్య పరిష్కారమయ్యే వరకు బాధి తుల పక్షాన పోరాటం చేస్తామని హామీనిచ్చారు. ఈ సంద ర్భంగా కాంగ్రెస్ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షు డు, కార్పొరేషన్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ పోగుల నరసింహ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్ తోటకూర అజరు యాదవ్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా బోడుప్పల్ పరిధిలోని కొన్ని సర్వే నెంబర్లలో వక్ఫ్ భూములు ఉన్నాయనీ, ప్రభు త్వం వాటి రిజిస్ట్రేషన్లను నిలిపి వేసిందని చెప్పారు. దీంతో సుమారు ఐదు వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ఎవరో ఒకరి ప్రయోజనం కోసం ఐదు వేలమంది కుటుం బాలను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం కారణంగా బోడుప్పల్లో ప్లాట్టు కొనుగోలు చేసిన అనేక మంది మానసిక క్షోభకు గురవుతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో సమస్యకు పరిష్కారం చూపిస్తామని చెప్పిన మంత్రి మల్లారెడ్డి నేడు రిజిస్ట్రేషన్లు నిలిపివేసేలా అధికారికంగా జీవో తెచ్చి, స్థానికులకు అన్యాయం చేస్తుంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రజల సమస్యను పరిష్కరించాలనీ, పరిష్కరించకపోతే ఎమ్మెల్యే, మేయర్ తమ పదవులకు రాజీనామా చేయాలనీ, తాము కూడా రాజీనామా చేస్తామని కాంగ్రెస్ కార్పొరేటర్లు సవాలు చేశారు.
ఒక్కరి కోసం వేలాది మందిని ఇబ్బందులకు గురి చేస్తారా?
గోనె శ్రీనివాస్, బీజేపీ అధ్యక్షుడు, కొర్పొరేటర్ కుంభం కిరణ్కుమార్రెడ్డి
వక్ఫ్ భూములని ప్రభుత్వం చేప్తున్న భూముల్లో ఇప్పటికే 90శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. వీటి నుంచి ఇంటి పన్నులు ఎందుకు వసూలు చేస్తున్నారో అధికారులు సమాధానం చెప్పాలి. ఎవరో ఒకరు కేసు వేశారనే నెపంతో ఐదు వేల కుటుంబాలను ఇబ్బందులకు గురి చేయడం సరైందేనా? ఎక్కడో కూర్చుని నిర్ణయాలు తీసుకోవడం కాదు, ప్రజల మధ్యకు వచ్చి పూర్తి వివరాలు తెలుసుకో వాలి. ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తాం. త్వరలోనే ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.
ప్రజలకు అండగా ఫెడరేషన్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వక్ఫ్ బోర్డు భూముల సమస్యకు పరిష్కారం చూపాలని ఏడాది కాలంగా తమ సమాఖ్య అధ్వర్యంలో సీఎం కేసీఆర్, మున్సి పల్ మంత్రి కేటీఅర్ దృష్టికి తీసుకెళ్లామని, స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి చొరవ తీసుకుని సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. బాధితుల పోరాటంలో కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య ఎప్పుడూ ముందుం టుందని సమాఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్ చెంచల నర్సింగ్ రావు హమీనిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొ రేటర్లు కొత్త దుర్గమ్మ, బొమ్మకు కళ్యాణ్ కుమార్, కో-ఆప్షన్ సభ్యులు బుర్ర దత్తాత్రేయ శాస్త్రి, కాంగ్రెస్ మేడ్చల్ బీ బ్లాక్ కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, యువజన కాంగ్రెస్ జిల్లా నాయకులు అసర్ల బీరప్ప, బీజేపీ జిల్లా నాయకులు జెనిగె వెంకటేష్ యాదవ్, జిల్లా కార్యదర్శి కూరపాటి విజరు కుమార్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కోళ్లపూడి విజయలక్ష్మి, బీజేపీ కార్యదర్శి ఎస్.ఎం ప్రగతి, ధర్మా రాజిరెడ్డి, కాటపల్లి ముత్యంరెడ్డి, యువమోర్చా నాయకులు దేవరకొండ వెంకటచారి, కిరణ్ కుమార్ గౌడ్, వివిధ కాలనీల వాసులు పాల్గొన్నారు.