Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
నాగారం మున్సిపాలిటీలోని నాగారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఉపా ధ్యాయులను నియమించాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి కలిసి వినతిపత్రం అందజేశారు. నాగారం ప్రభుత్వ పాఠశాలలో 960 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేనందున విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రికి వివరించారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించడంతోపాటు ఉపాధ్యాయు లను నియమించాలని కోరారు. అనంతరం మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యా యులను వెంటనే ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. విద్యాశాఖ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తా మని పేర్కొన్నారు. మంత్రిని కలిసిన వారిలో కౌన్సిలర్లు బిజ్జ శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ నాయకులు గండి అంజయ్యగౌడ్, దయాకర్, ఆనంద్ పాల్గొన్నారు.