Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
- సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లికార్జున్
- సమ్మె పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
లేబర్ కోడ్లతో, కార్మిక వ్యతిరేక నిర్ణయాలతో హక్కులపై దాడి చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధాలను ప్రతిఘటించేందుకు ఈ నెల 8వ తేదీన జరిగే రాష్ట్ర వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్య క్షులు జె.మల్లికార్జున్ పిలుపునిచ్చారు. మంగళవారం షాపూర్నగర్ కార్యాలయంలో సీఐటీయూ క్లస్టర్ కార్యదర్శి ఈశ్వర్రావు అధ్యక్షతన జీడిమెట్ల గాంధీనగర్ సీఐటీయూ ఆఫీస్ బేరర్స్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక కూడా రాష్ట్రంలో ఉమ్మడి ఏపీలోని పాత జీవోలనే కొనసాగిస్తున్నారని తెలి పారు. 73 షెడ్యూల్ పరిశ్రమల్లో దశాబ్ద కాలం గడిచినా కొత్త జీవోలు విడుదల చేయడం లేదన్నారు. 2015లోనే టీఎస్ ఐపాస్ చట్టం తెచ్చి పారిశ్రామిక అధిపతులకు భూములు, రాయితీలిచ్చి సకల మర్యాదలు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలనే సోయి మాత్రం లేదనీ, కేవలం వాగ్దానాలతో కాలం వెళ్లబుచ్చు తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి కార్మిక వర్గాన్ని బానిసత్వంలోకి నెట్టేందుకు ఒడిగ ట్టిందన్నారు. దేశ సహజ వనరులు, ప్రజా సంపద ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ, విదేశీ కార్పొరేటర్లకు తెగనమ్ముతున్నదన్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలను ప్రతిఘటించేందుకు 73 షెడ్యూల్డ్ పరిశ్రమల కనీస వేతనాల జీవోలు సాధించుకునేందుకు పోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్త సమ్మెకు సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని చెప్పారు. ఈ సమ్మెలో యూనియన్ అనుబంధాలతో నిమిత్తం లేకుండా యావత్ తెలంగాణ కార్మిక వర్గం ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమ్మెకు తెలంగాణ సమాజం తమ పూర్తి మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు లక్ష్మణ్, జిల్లా అధ్యక్షులు అశోక్, వెంకయ్య, ప్రసాద్, దేవదానం, బీరప్ప, శివరామకృష్ణ, బాలాజీ, రవి, శ్రీనివాస్, లింగస్వామి పాల్గొన్నారు.