Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులను దారుణంగా హత్య చేసిన దుండగులను శిక్షించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం (ఐద్వా) రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ హత్యను ఖండి స్తూ బుధవారం ఐద్వా, డీవైఎఫ్, ప్రజా సంఘాల ఆధ్వ ర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్. లక్ష్మి మాట్లాడుతూ పది నెలలుగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని పెద్ద ఎత్తున రైతులు పోరాడుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. దారుణానికి కారకు డైన వ్యక్తి, కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లఖింపూర్ కేరి ఘటనపై విచారణ జరిపి హత్యకు గురైన రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకులు సిమ్రాన్, నాగలక్ష్మి, మీనాపూనం, డీవైఎఫ్ఐ నాయకులు లక్ష్మణ్, ఆరిఫ్, ముక్తార్, షరీఫ్, సమీర్, తదితరులు పాల్గొన్నారు.