Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ నగర నాయకులు మల్లేష్ : గోడ పత్రిక ఆవిష్కరణ
నవతెలంగాణ-మెహదీపట్నం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈనెల 8న జరిగే రాష్ట్రవ్యాప్త బంద్కు కార్మికులు, కర్షకులు, ప్రజలందరూ సంపూర్ణ మద్దతు ఇస్తూ విజయవంతం చేయాలని సీఐటీయూ నగర నాయకులు మల్లేష్ విజ్ఞప్తి చేశారు. సీఐటీయూ నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం టోలిచౌకి చౌరస్తాలో బంద్కు సంబంధించి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్ఎంసీ పరిధిలోని కార్మికులను ప్రత్యేక కేటగిరీగా గుర్తిస్తూ వారందరికీ నెలకు రూ.24 వేల జీతం, అర్హుందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని ఏండ్లుగా ప్రభుత్వానికి ఎన్ని విన్నపాలు చేసిన వాటన్నిటినీ బుట్టదాఖలు చేస్తుందని దుయ్యబట్టారు. ప్రభుత్వం కార్మికుల పట్ల అవలంభిస్తున్న నిర్లక్ష్యపూరిత వైఖరికి, కార్మిక వ్యతిరేక చట్టాలకు నిరసనగా ఈనెల 8న జరపబోయే బంద్కు ప్రతి ఒక్కరూ మద్దతునిచ్చి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ నాయకులు లక్ష్మణ్, మధు, యాదమ్మ, బాలకష్ణమ్మ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్: 8న జరిగే రాష్ట్రవ్యాప్త బంద్లో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని మోతినగర్ అడ్డా వద్ద సీపీఐ(ఎం), సీఐటీయూ నాయకులు వాల్పోస్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు స్థాయి శేషగిరిరావు నీలందర్, నరసింహ, శంకర్, కిష్టయ్య, సుశీల, చిట్టెమ్మ, చాందిని, నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.