Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
గౌతమ్నగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానెహ్రూ బస్తీ కమ్యూనిటీ హాల్లో ఆదివారం సన్ఫ్లవర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌతమ్నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీతరాముయాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పేద ప్రజలు నివసించే ఇలాంటి ప్రాంతంలో ఉచిత వైద్య సేవలు జరుగడం చాలా సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా సుమారు 400 మంది పేదలకు బీసీ, షుగర్, కంటి పరీక్షలు నిర్వహించారనీ, రీపోర్ట్స్ వచ్చిన వెంటనే వారికి ఉచితంగా మందులు కూడా అందిస్తామని తెలిపారు. అనంతరం సన్ఫ్లవర్ హాస్పిటల్ యాజమాన్యం, సిబ్బందిని కార్పొరేటర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాముయాదవ్, హాస్పిటల్ సిబ్బంది, స్థానిక కాలనీ వాసులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.