Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
శాసనసభ నియోజకవర్గం అభివృద్ధి నిధుల నుంచి శ్రీనివాసనగర్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.70 లక్షలు కేటాయిస్తున్నట్టు అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. బాగ్ అంబర్ పేట డివిజన్ పరిధిలోని శ్రీనివాస్నగర్ కాలనీ హౌసింగ్ హాల్ నిర్మాణానికి సానిక కార్పొరేటర్ బి.పద్మా వెంకట్రెడ్డితో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ కొన్ని నెలల క్రితం చెందిన అసోసియేషన్ పెద్దలు తనను కలిసి కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టాలని కోరినట్టు తెలిపారు. వారి కోరిక మేరకు తన ఎమ్మెల్యే బడ్జెట్ నుంచి ఈ కమ్యూనిటీహల్కు నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. కాలనీ వాసులకు నచ్చిన డిజైన్లలో అన్ని వసతులు ఉండేలా కమ్యూనిటీ హాల్ నిర్మా ణం చేపడతామన్నారు. కాలనీ అసోసియేషన్ ప్రతనిధులు దగ్గరుండి నిర్మాణ పనులను చూసుకోవాలని చెప్పారు. కాలనీలో ఎలాంటి సమస్యలున్నా వాటిని తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు జి.నగశయ నరావు, టి ఎస్ రాజగోపాల్, డి.శివప్రసాద్, శ్రీనివాస్, మురళి, శ్రీధర్, చక్రపాణి, మహాలక్ష్మి, లలిత, మైతిలి, సురేష్, శేషుకుమర్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, నాయకులు జీవన్గౌడ్, రాజేష్, శ్రీనివాస్ యాదవ్, కోట్ల సంతోష్, దారయోబు, స్వామి, పి.చంద్ర శేఖర్, బొట్టు శ్రీను, బీజేపీ నాయకులు మిర్యాల శ్రీనివాస్, టి.వెంకటేష్, బాలకృష్ణగౌడ్, తదితరులు పాల్గొన్నారు.