Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అడిక్మెట్
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ముదిరాజులకు ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ముదిరాజ్ యువసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టైగర్ చంటి ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం ముదిరాజ్ రాష్ట్ర కార్యాల యంలో ముదిరాజ్ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా చంటి ముదిరాజ్ ఎన్నికయ్యారు. అనంతరం ఆయన మాట్లా డుతూ ముదిరాజుల చిరకాల స్వప్నం బీసీ డీ నుంచి బీసీ ఏ కేటగిరిలోకి మార్చాలని అన్నారు. బీసీ కమిషన్ ద్వారా సుప్రీంకోర్టులో వెంటనే నివేదిక సమర్పించాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మత్స్యశాఖలో చేప పిల్లల కొనుగోలు విషయంలో దళారీ వ్యవస్థను రద్దు చేస్తూ మత్స్యశాఖ సొసైటీ ఖాతాలో నేరుగా డబ్బు వేయాలని కోరారు. ముది రాజులకు ప్రధాన రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో తగినన్ని సీట్లు కేటాయించాలనీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యువసేన రాష్ట్ర అధ్యక్షులు బోల్ల గణేష్ ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెరిక శ్రీశైలం ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.