Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
కమ్యూనిటీ హాల్ను ప్రజా సంక్షేమానికి వినియో గించుకోవాలని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం గోల్నాక బాగ్ అంబర్పేట డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మించిన కమిటీ హాల్ను అంబర ్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్గౌడ్, బాగ్ అంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకట్రెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ హాల్స్ పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగించుకోవాలనీ, అందుకు అధికారులు దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతంరావు, మాజీ నగర అధ్యక్షులు బి.వెంకట్రెడ్డి, స్థానిక నాయకులు రంగంపల్లి రాజు, పాండు, ఈశ్వరు, గడ్డం శ్రీధర్గౌడ్, దాడిగే జగన్, జితేంద్రగౌడ్, కంచె చంద్రశేఖర్, లక్ష్మణ్, మహేందర్గౌడ్, కపిల్దేవ్ పాల్గొన్నారు.