Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
జీహెచ్ఎంసీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచే విధంగా టీటీయూసీ నాయకులు, కార్మికులను ప్రోత్సహిస్తూ చిత్తశుద్ధితో పని చేయాలని టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు శోభన్రెడ్డి సూచించారు. టీటీయూసీ మల్కాజిగిరి సర్కిల్ అధ్యక్షులు సీహెచ్. సంజీవ్ ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన వాహన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతె శోభన్రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి ముఖ్యఅ తిథులుగా హాజరయ్యారు. అనంతరం మల్కాజిగిరి సర్కిల్ నేరేడ్మెట్లోని డంపింగ్ యార్డును సందర్శించి, డంపింగ్ యార్డులో కార్మికులు ఏర్పాటు చేసిన వాహనం పూజా కార్యక్రమంలో పాల్గొని, దుర్గామాతకు నారీకేళం సమర్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ డంపింగ్ యార్డులో పని చేస్తున్న కార్మికులకు సంబంధించి సౌకర్యాలను పరిశీలించారు. కార్మికులను వారి సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ టీటీయూసీ నాయకులను ఉద్ధేశించి శోభన్రెడ్డి మాట్లాడుతూ కార్మికులు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఇబ్బం దులు ఉన్నా, వాటిని పరిష్కరించేందుకు అన్ని వేళలా మీకు అందుబాటులో ఉంటూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ టీటీయూసీ అధ్యక్షులు గబ్బర్ బారు, సంజు, పాండు, ఉపేందర్, జీహెచ్ఎంసీ ట్రాన్స్పోర్టు డ్రైవర్లు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.