Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ జిల్లాలో మొత్తం 12 జోన్లకు 12 మంది ఉప విద్యాశాఖాధికారులకు (డిప్యూటీ ఈవో)గాను ఒక్క రెగ్యులర్ డిప్యూటీ ఈవో లేకపోగా.. 24 మంది ఉపపర్యవేక్షణాధికారులకు (డిప్యూటీ ఐవోఎస్)గాను ఒక్కరే రెగ్యులర్ అధికారి కొనసాగుతు న్నారు. అంటే 34 అతి ముఖ్యమైన పోస్టుల్లో ఇన్చార్జిలే ఉండటం గమనార్హం. దీనికితోడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సీనియర్ అసిస్టెంట్లకు ఈ అదనపు బాధ్యతలను అప్పగించారు. ఫలితంగా వారు సకాలంలో తమ సిలబస్ పూర్తి చేయలేక, మండలంలోని పాఠశాలలను పూర్తిస్థాయిలో పర్యవేక్షించలేక, కొవిడ్ నిబంధనలు అమలు చేయడంలో అనేక ఇబ్బందులు, ఒత్తిడులకు లోనవుతున్నారు.
ఒక్కరే రెగ్యూలర్ అధికారి..!
జిల్లాలో 16 మండలాలకు గాను 24 మంది ఉప పర్యవేక్షణా ధికారులు పని చేస్తున్నారు. ఇందులో చార్మినార్-2 ఉపపర్యy ేక్షణాధికారి నెహ్రు బాబు ఒక్కరే రెగ్యులర్ డిప్యూటీ ఐవోఎస్గా విధులు నిర్వర్తిస్తున్నారు. హిమయత్నగర్, అంబర్పేట, అమీర్ పేట, ఆసిఫ్నగర్, బహుదూర్ పూర, చార్మినార్-1, గొల్కోండ, ఖైరతాబాద్, బండ్లగూడ, మారేడుపల్లి, ముషీరాబాద్, నాంపల్లి, సైదాబాద్, సికింద్రాబాద్, షేక్పేట్, తిరుమలగిరి మండలాల్లో ఇన్చార్జిలతోనే నెట్టుకోస్తున్న తీరు కనిపిస్తోంది. జిల్లాలో 682 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు 502, ఉన్నత పాఠశాలలు 182 ఉండగా 1,15,001 మంది చదువుతున్నారు. ఇక ప్రయివేటు పాఠశాలలు 2వేల లోపు ఉండగా.. వీటిల్లో దాదాపు 7లక్షలపైగా విద్యార్థులు విద్యనభ్యసి స్తున్నారు. తమ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలను వీరే పర్యవేక్షించాలి. కానీ అది అనుకున్న స్థాయిలో జరగడం లేదు. ఫలితంగా ప్రాథమిక దశలో విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమవుతున్నారు. ఇదిలా ఉంటే జిల్లాలో ఉన్నత పాఠశాలలను పర్యవేక్షించే ఉపవిద్యాశాఖాధికారులు సైతం ఇన్చార్జిలే కావడంతో వాటి పర్యవేక్షణ సైతం గాల్లో దీపంలాగే మారిందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు.
అదనపు బాధ్యతలు..
జిల్లాల్లోని సర్కారు బడుల్లో ప్రధానోపాధ్యాయులుగా పని చేస్తున్న వారిపై రెండు మూడేసి బాధ్యతలున్నాయి. ఇందులో ప్రస్తుతం ఇన్చార్జి డిప్యూటీ ఈవోలుగా, డిప్యూటీ ఐవోఎస్లుగా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులే విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. ఇక వీరిలో కొంతమంది ఒక్క మండలానికి డిప్యూటీ ఈవోగా కొనసాగుతూ.. మరో మండలంలో డిప్యూటీ ఐవోఎస్ బాధ్యతలు చూస్తూ.. మరోక స్కూల్కు హెడ్మాస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంకో చోట అయితే ఒక్కరే డిప్యూటీ ఐవోఎస్గా రెండు బాధ్యతలు చూస్తున్నారు. ఏండ్ల తరబడిగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించకపోవడంతో అనిన్ని మండలాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. మొత్తంగా క్షేత్రస్థాయిలోని పాఠశాలలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించలేకపోతున్నారు. విద్యా వ్యవస్థలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం మండల స్థాయిలో వెళ్లాలంటే వీరిదే కీలక పాత్ర. ప్రధానోపాధ్యాయులపై అదనపు బాధ్యతల కారణంగా పాఠశాలల పనితీరుపై పర్యవేక్షణ కొరవడమే కాకుండా మెరుగైన విద్య, శత శాతం ఉత్తీర్ణత సాధ్యమయ్యే అవకాశాలు తక్కువే. ప్రభుత్వ బడుల్లో సరిపడా ఉపాధ్యాయులు ఉంటే మెరుగైన విద్యతోపాటు మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది.
జిల్లాకు ఆ నిబంధనతో సంబంధం లేదు..
జిల్లాలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 182 ఉన్నాయి. ఇందులో 182కు హెడ్మాస్టర్లు ఉండాలి. అలాగే డిప్యూటీ ఈవో స్థాయి పోస్టులు 22, డిప్యూటీ ఐవోఎస్ స్థాయి పోస్టులు 24 ఉండాలి. మొత్తం 228 ఖాళీలున్నాయి. ప్రస్తుతం ఆ పోస్టుల్లో వందలోపే హెడ్ మాస్టర్లు పని చేస్తున్నారు. మరో 100కుపైనే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయితే ప్రభుత్వం పదోన్నత్తులు కల్పిస్తే.. ఈ 100కుపైగా స్కూల్ అసిస్టెంట్లకు ప్రమోషన్లు లభించే అవకాముంది. ఇందుకు ఎలాంటి అడ్డంకులు కూడా లేవు. వాస్తవానికి హైదరాబాద్ జిల్లాకు ఉమ్మడి సర్వీసు నిబంధనతో ఎలాంటి సంబంధం లేదు. జిల్లాలో అయితే జేడ్పీ, డీఈవో మేనేజ్మెంట్లు ఉంటాయి. అక్కడైతే సీనియారిటీ సమస్య వస్తోంది. కానీ హైదరాబాద్ జిల్లా మాత్రం డీఈవో మేనేజ్మెంట్ పరిధిలో ఉంటుంది. అయినప్పటికీ సర్కారు సీనియర్ ఉపాధ్యా యులకు పదోన్నతులు కల్పించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది.