Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- జూబ్లీహిల్స్
భారత గ్రామ నవ నిర్మాణ సంస్థ, (మారీ) ఆధ్వర్యంలో కోవిడ్-19 టీకాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా మోతీ నగర్లోని రాయల్ ఫంక్షన్ హాల్లో గూడూరి ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు జి.శ్రీధర్రెడ్డి సహాయ సహకారాలతో ఉదయం 9 గంటల నుండి నాలుగు గంటల వరకు సుమారు 250 మందికి కోవిషీల్డ్ టీకాలను అందించి, వారికి అల్పాహారం, సాఫ్ట్ డ్రింక్ను అందించారు. రాయల్ ఫంక్షన్ హాల్ యజమాని శ్రీధర్రెడ్డి ముందురోజు వ్యాక్సిన్ వేస్తున్నట్లు అన్ని గ్రూపులలో వేసినందున, సమీపంలోని నాలుగు కాలనీల ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగిం చుకున్నారు. ''మారి'' స్వచ్ఛంద సంస్థ కోఆర్డినేటర్ ఎం.వెంకన్న మాట్లాడుతూ సభ్యులు ప్రతి కాలనీలో డోర్ టు డోర్ తిరిగి, వ్యాక్సిన్ తీసుకొని వారికి టోకెన్లు ఇచ్చి, మరుసటి రోజు వ్యాక్సిన్ వేస్తున్న సెంటర్కు వచ్చునట్లు వారికి సలహాలు ఇచ్చి వ్యాక్సిన్ తీసుకొనుటకు సహాయ పడుతున్నారు. అందువలన సెంటర్కు వచ్చి టోకెన్ చూపినవారికి ఆధార్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకొని, వెంటనే వ్యాక్సిన్ ఇచ్చి పంపుతున్నారు. ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఇప్పటి వరకు 15వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని, అరవై వేల మందికి ఇచ్చేవరకు సేవలు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జి.ఎన్.ఎమ్. లక్ష్మి, డేటా ఎంట్రీ ఆపరేటర్ జీవిత, చందన, లావణ్య, సంతోషి పాల్గొన్నారు.