Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
ఈస్ట్ ఆనంద్ డివిజన్ పరిధిలోని కాలనీలు, బస్తీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిం చడానికి తగిన కృషి చేస్తానని ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ కార్పొరేటర్ వై.ప్రేమ్ కుమార్ అన్నారు. సోమవారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ పార్కులో రూ.5 లక్షలతో అభివృద్ధి, బోర్వెల్ పనులను ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారం భించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ముఖ్యంగా డివిజన్ లోని కాలనీలు, బస్తీల్లో డ్రయినేజీ, తాగునీటి, వీధి దీపాలు, మౌలిక సదుపా యాలు వంటి సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమం లో బాబు, పల్లె విజయకుమారి, కాలనీవాసులు సుధాకర్, పూర్ణచంద్ర రావు, నవీన్, చంద్రశేఖర్, నరసింహ, మల్లేష్, గపూర్, కృష్ణ, అశోక్, పాల్గొన్నారు.