Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట
నేరాల నియంత్రణ కోసం సీసీ కెమరాలు ఎంతో ఉపయోగపడతా యనీ, ఒక సీసీ కెమరా వంద మంది పోలీసులతో సమానమని కార్పొరేటర్ జెనిగ పద్మా ఐలయ్య యాదవ్ అన్నారు. సోమవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధలో ఉన్న 2వ డివిజన్లోని అల్మాస్గూడలో కే ఎం అర్ అపార్ట్మెంట్ సభ్యుడు, కార్పొరేటర్ జెనిగె పద్మా ఐలయ్య యాదవ్ అపార్ట్ మెంట్ సభ్యులకు తన స్వంత నిధులు రూ.10 వేలతో సీసీ కెమరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నేటి సమా జంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నేరాలు ఎంతో పెరిగాయనీ, వాటి నియంత్రణకు సీసీ కెమరాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.