Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్ రూరల్
విద్యార్థులు తమ లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేయాలని అనురాగ్ యునివర్సిటీ వైస్ చాన్స్లర్ ఎస్.రామచంద్రం అన్నారు. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ అనురాగ్ యునివర్సిటీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న బానోత్ మంజుల నాయక్ 10 రోజుల పాటు మహారాష్ట్రలో జరుగు ఎన్ఎస్ఎస్ ప్రీ రిపబ్లిక్ పరేడ్ డే క్యాంపు 2021కి ఎంపికవడం పట్ల విద్యార్థిని మంజుల నాయక్ను పూల బొకే అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్లో రాణించాలంటే ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పర్చుకుని వాటి సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యునివర్సిటీ రిజిస్టార్ సమీన్ ఫాతిమా, ఇంజినీరింగ్ విభాగం ఢన్ీ విష్ణుమూర్తి, హెచ్ఓడీ సతీష్ కుమార్, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్ చెన్నకేశవ మల్లేష్, ప్రోగ్రాం ఆఫీసర్ నాయబ్ రసూల్, తదితరులు పాల్గొన్నారు.