Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యి మీదే ముఖ్యమంత్రి కేసీఆర్ వంట చేస్తున్నారని టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కిన నర్సింహులు అన్నారు. సోమవారం బౌద్ధ నగర్లో టీడీపీ సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వల్లారపు శ్రీనివాస ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజన్ నాయకుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ట్రస్టీలు లేకుండా పని చేయాలన్నారు. ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎవరి మీద కేసులు పెట్టాలో అనే ఆలోచనే తప్ప, ప్రజలకు చేసింది ఏమి లేదన్నారు. తెలంగాణలో దళితుడిని ముఖ్యమంత్రి చేస్తామని, మూడు ఎకరాల భూమి ఇస్తామని మోసం చేశారన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని, అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. సమావేశంలో డివిజన్ అధ్యక్షులు జీవీ కృష్ణ, గండికోట విజయకుమార్, తడక వినోద్ కుమార్, కాత విజయకుమార్, ప్రధాన కార్యదర్శులు లక్ష్మణ్ ముదిరాజ్, జీఎం రమేష్, చందర్ ముదిరాజ్, శ్రీనివాస్ యాదవ్, నాయకులు కొమరయ్య, పొట్టి శ్రీను, శంకర్,పేపర్ శ్రీనివాస్, గణేష్, గిరిబాబు, చిరంజీవి, చంద్రమోహన్, అన్వర్, జగన్, రవి, మహేష్ పాల్గొన్నారు.