Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ పరిధిలో పేపర్ వాల్యుయేషన్ రుసుము పెంచాలని తెలంగాణ ప్రయివేట్ డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కట్టా శేఖర్ కోరారు. ఈమేరకు సోమవారం ఓయూ కంట్రోలర్ శ్రీరామ్ వెంకటేష్కు వినతి పత్రం అందజేశారు. పేపర్ వాల్యుయేషన్ ఆఫ్లైన్లో ఉన్నప్పుడు ఒక్కరోజు 30 పేపర్లు కరెక్షన్ చేసేవారని, కానీ ఇప్పుడు ఆన్లైన్ అయిన తర్వాత ఒక్కొక్కరికి 80 నుంచి 100 వరకు పేపర్స్ ఇవ్వడంతో అధ్యాపకులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. గత ఐదేండ్లుగా పేపర్ వాల్యుయేషన్ ఒక్క పేపర్కు రూ.15 మాత్రమే ఇస్తున్నారని, దీనిపై అధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లినా ఇంతవరకు ఇలాంటి స్పందన లేదు అని వాపోయారు. పేపర్ వాల్యుయేషన్ అమౌంట్ పెంచాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డిగ్రీ కాలేజ్ ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్, ఉపాధ్యక్షులు శివ కుమార్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.