Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్పేట్
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన స్థానిక ప్రజలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ(ఎం) నాయకులు కృష్ణనాయక్ డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం రాజన్నబౌలి, లక్ష్మీ నగర్, శివాజి నగర్, మొరాంబాయి, ఛత్రినాక తదితర ప్రాంతాల్లో పర్యటించి భారీ వర్షాల కారణంగా నష్టపోయిన కుటుంబాల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షపునీరు భారీఎత్తున రావడం వల్ల ఇండ్లలో ఉన్న వస్తువులు, నిత్యావసర సరుకులు తడిసి ముద్దయ్యాయని చెప్పారు. వర్షం వచ్చి మూడు రోజులు కావస్తున్నా ఇప్పటివరకు నీటమునిగిన కుటుంబాల సమస్యలను తెలుసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వ అధికారులు, ప్రతినిధులు తీరు కనిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మానవత్వంతో ప్రజలను ఆర్థికంగా ఆదుకోని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కిషన్, స్థానికులు లత, రామమణి, కమలమ్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.