Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛత్రపతి శివాజీనగర్లో ఘటన
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఆరుగురు యువకులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన సనత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ, ఛత్రపతి శివాజీనగర్లో బుధవారం చోటు చేసుకుంది. వారందరి ఫోన్లు కూడా స్విచ్చాఫ్ వస్తుండటంతో వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చుట్టు పక్కల వెతికినా, తెలిసిన వారిని, బంధువులను ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.