Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అల్వాల్
అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ ఏడుగుళ్ళులో అమ్మవారిని స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేందర్నాథ్ దర్శించుకున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాదీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు బొబ్బిలి సురేందర్రెడ్డి, స్టార్ రాజు, శ్రావణ్, శ్రీశైలం, కొండల్ రెడ్డి, ఆరీఫ్, వెంకటేష్గౌడ్, తదితరులు పాల్గొన్నారు.