Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
ఈ నెల 24న హైదరాబాద్లో నిర్వహించనున్న మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసభలను విజయ వంతం చేయాలని ముషీరాబాద్ ఎం ఎస్ఎఫ్ ఇన్చార్జి బుంజూరు విజరు మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం ముషీరాబాద్ డివిజన్ భరత్నగర్, భారత సేవా సమాజ్ కమ్యూనిటీ హాల్లో మహాసభల పోస్టర్ను విష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గండి కృష్ణ మాదిగ, గండు వెంకటేష్ మాదిగ, గజ్జెల దయానంద మాదిగ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మాదిగ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఈ మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయ కులు తాండ్ర మురళి మాదిగ, కవాడిగూడ డివిజన్ అధ్య క్షులు గంగాధర్, మహేష్ కుమార్ మాదిగ, ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షులు గడ్డం శ్రీకాంత్ మాదిగ, రాంనగర్ డివిజన్ అధ్యక్షులు రాములు, బోలక్పూర్ అధ్యక్షులు వెంకటేష్, నాయకులు చంద్రకాంత్, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.