Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడుతాయని జగద్గిరిగుట్ట డివిజన్ కార్పొరేటర్ కొలుకుల జగన్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని అంజయ్యనగర్ శివాలయం వీధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాలనీ భద్రత కోసం అసోసి యేషన్ సభ్యులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అన్ని బస్తీలు, కాలనీల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు అసోసియేషన్ సభ్యులు ముందుకు రావాలన్నారు. శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి అవసరమైన నీటి సౌకర్యం కోసం బోరు వేస్తానని హామీ నిచ్చారు. బస్తీల్లో సీసీ రోడ్ల పనులను త్వరలోనే ప్రారంభి స్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బాబుగౌడ్, డివిజన్ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు విఘ్నేష్, బస్తీ అసోసియేషన్ అధ్యక్షులు నరేష్గుప్త, ఉపాధ్యక్షులు కోటగడ్డ శ్రీనివాస్, ప్రవీణ్చారి, ప్రధాన కార్యదర్శి వెంకటేష్గౌడ్, కోశాధికారి భూమన్న, కార్యవర్గ సభ్యులు మహబూబ్, రహీంబాషా, రామారావు, రవీంద్రచారి, కిరణ్, తదితరులు పాల్గొన్నారు.