Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మానవ హక్కుల సంస్థ్ణ ప్రతినిధులు ప్రజలు, ప్రభుత్వాలకు వారధులుగా ఉండాలని నేషనల్ నింబుల్ హుమన్ రైట్స్ ఫౌండేషన్ (ఎన్ఎన్హెచ్ఆర్ఎఫ్) ఫౌండర్, డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చైర్మెన్ సీహెచ్ విజయ మోహన్రావు అన్నారు. బుధవారం మల్కాజిగిరి సర్కిల్ మిర్జాలగూడలోని ఎస్వీ ఫంక్షన్ హాల్లో నేషనల్ నింబుల్ హుమన్ రైట్స్ తెలంగాణ ప్రాంతం ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంస్థ ఐడీ కార్డులు, నియామక పత్రాలను అందజేశారు. ఎన్ఎన్ హెచ్ఆర్ఎఫ్ హుమన్ రైట్స్ విలువలను గుర్తు చేస్తూ 1215వ సంవత్సరంలో ఇంగ్లాండ్ అప్పటి రాజు జాన్ విడుదల చేసిన మాగ్నా కార్టా మొట్టమొదటి మానవ హక్కుల ప్రకటన నుంచే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పొందాయన్నారు. 1993లో రూపొందించిన మానవ హక్కులు పరిరక్షణ 1994 జనవరి 8 నుంచి అమల్లోకి వచ్చిందన్నారు. ఎన్ఎన్హెచ్ఆర్ఎఫ్ ఫౌండేషన్ విలువలను కాపాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధు లుగా ఉండి బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డీజీసీఓఓ ప్రవీణ్రావు, నేషనల్ జనరల్ సెక్రెటరీ గడ్డల జానకికాంతారావు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రుద్రరాజు విక్రమ్రావు, వివేకానంద, హుమన్ రైట్స్ చీఫ సీహెచ్ సాయిసాగర్, నటరాజణి తేనీలతోపాటు నేషనల్ చీఫ్లు, స్టేట్ చీఫ్లు, జిల్లా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.