Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని సఫిల్గూడ మినీట్యాంక్ బండ్ వద్ద అధికారులు ఏర్పాటు చేసిన పలు ప్రాంతాలను బుధవారం మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్కుమార్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజిగిరి డివిజన్ పరిధిలోని సద్దుల బతుకమ్మల, నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారనీ, బతుకమ్మల నిమజ్జనానికి సఫిల్గూడ చెరువు వద్ద ప్రత్యేక కొలనులు ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఏఈ దీపక్, వర్క్ ఇన్స్పెక్టర్ రమేష్, బీజేపీ నాయకులు సునీల్ యాదవ్, మురళిగౌడ్, మహేందర్ పాల్గొన్నారు.