Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
దసరా పండుగను సంతోషంగా జరుపుకోవాలని బాగ్ అంబర్పేట కార్పొరేటర్ పద్మా వెంకట్రెడ్డి అన్నారు. దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని తెలంగాణ జాగృతి సరస్వతి మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ఆధ్వ ర్యంలో మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం మంగళ వారం బాగ్ అంబర్పేట్లోని మల్లికార్జుననగర్ కమ్యూని టీ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మా వెంకట్రెడ్డి అకాడమీ అధ్యక్షు రాలు దాసరి రమ్యతో కలిసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేవా కార్యక్ర మంలో భాగంగా దసరా పండుగను పురస్కరించుకుని మహిళలకు చీరల పంపిణీ అభినందనీయమన్నారు. భవిష్యత్లో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. దాసరి రమ్య మాట్లాడుతూ తమ అ అకాడమీ ఆధ్వర్యంలో కరోనా సమయంలో ప్రజలకు ఆహార పంపిణీతోపాటు అనేక కార్యక్రమాలను నిర్వహిం చామని తెలిపారు. ప్రతియేటా దసరా పండుగ సంద ర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామని పేర్కొ న్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజికవేత్త వంశీ, ఉజ్వల సామాజిక స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు లక్ష్మి, బాగ్ అంబర్పేట్ డివిజన్ అధ్యక్షుడు చుక్క జగన్, బీజేపీ నాయకులు దత్తు, సాయన్న, సంజరు, బాలకృష్ణ, గురుస్వామి మహంకాళి కృష్ణమూర్తి పాల్గొన్నారు.