Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య జోన్లో భద్రత, సరుకు రవాణా లోడింగ్, రైళ్ల రవాణాలో సమయపాలనపై సికింద్రాబాద్లోని రైల్ నిలయం నుంచి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సికింద్రా బాద్, హైదరాబాద్తోపాటు ఆరు డివిజన్ల అధికారులు, డివిజినల్ మేనేజర్లు (డీఆర్ఎమ్లు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ఈ సమావేశంలో పాల్గొన్నారు. భారతీయ రైల్వే పర్యావరణ పరిరక్షణ, స్వచ్ఛ ఇంధన శక్తిని ప్రోత్సాహిస్తూ రవాణా రంగంలో అభివృద్ధిని సాధించిన సందర్భంగా పర్యావరణ సమతుల్యతపై ఒక 'ఇ' పుస్తకాన్ని జనరల్ మేనేజర్ ఆవిష్కరించారు. రైల్వేలో ఇంధన పొదుపు చర్యలను ప్రోత్సాహించడం, రైలు వినియోగ దారుల కోసం శుభ్రత నిర్వహణ ఈ పుస్తకం లక్ష్యమని ఆయన తెలిపారు. పర్యావరణ సమతుల్యత కోసం చర్యలు, ఘణ వ్యర్థాల నిర్వహణ, హౌస్ కీపింగ్ కార్యకలా పాలు, చెట్ల పెంపకంతోపాటు ఇతర పర్యావరణహిత కార్యకలాపాలు మొదలగు అంశాలు ఈ పుస్తకంలో ఉన్నా యన్నారు. ఈ పుస్తక రూపకల్పనలో కృషి చేసిన అధికారు లు, సిబ్బంది పనితీరును జనరల్ మేనేజర్ ఈ సందర్భంగా అభినందించారు.