Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్నగర్
ఈ నెల 31వ తేదీన జరిగే జాతీయ మెమోరీ ఛాంపియన్ షిప్ పోటీలను ఆన్లైన్లో నిర్వహించ నున్నట్టు వరల్డ్ మెమోరీ కౌన్సిల్ ఇండియా అధ్యక్షులు ఆర్.జయసింహా బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ పోటీలను ఆన్లైన్లో నిర్వహిస్తున్నామని తెలిపరు. ఈ పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్ను జయేష్ రంజన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి 'ఇండియన్ నేషనల్ మెమోరి ఛాంపియన్షిప్-2021' టైటిల్తో పాటు రూ.10 లక్షల నగదు, కోర్సు రూపంలో బహుమ తులు అందజేస్తామన్నారు. పదాలు, అంకెలు, బైనరీ అంకెలు, చారిత్రక తేదీలు, ప్లేయింగ్ కార్డ్స్ గుర్తు పెట్టుకో వడం అనే ఐదు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారని తెలిపారు. గెలిచిన వారు ప్రపంచ మెమోరి ఛాంపియన్ షిప్లో ఇండియా తరుపున పోటీ చేయడానికి అర్హత సాధిస్తారన్నారు. ఈ పోటీల్లో పాల్గొన దలచిన వారు వెబ్సైట్ షషష.jayaరఱఎష్ట్రa.ఱఅ, ఫోన్: 9985031777, 9985041777 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ కనెక్ట్ సీఈవో నిఖిల్ గుండా పాల్గొన్నారు.