Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్నగర్
59 ఎస్సీ కులాల్లో మూడో ఉన్న బేడ, బుడగ జంగాలకు అన్ని రాజకీయ పార్టీలు రాబోయే ఎన్నికల్లో రెండు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని బేడ, బుడగ జంగం హక్కుల పోరాట సమితి (బీజేహెచ్సీఎస్) అధ్యక్షులు కోడిగంటి నర్సింహా కోరారు. మంగళవారం హిమాయత్నగర్లోని బీసీ సాధికారత సంస్థ రాష్ట్ర కార్యాలయంలో సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితబంధు పథకంలో మొదటి ప్రాధాన్యత కల్పించి, మూడెకరాల భూమితోపాటు డబుల్ బెడ్రూం ఇండ్లు అందజేయాలని కోరారు. బ్యాంకులలో ఎలాంటి షరతుల్లేకుండా రూ.10 లక్షల రుణం మంజూరు చేయాలన్నారు. ఈ సమావేశంలో సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గగనం మంతప్ప, నాయకులు గగనం వెంకటస్వామి, తూర్పాటి శ్రీనివాసులు, సిరివాటి శ్రీనివాసులు, రామకృష్ణ, కడమంచి రాంబాబు, యువజన విభాగం రాష్ట్ర కో-ఆర్డినేటర్ సిరివాటి రమేష్, తదితరులు పాల్గొన్నారు.