Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్బజార్
అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. దేవీ నవరాత్రుల సందర్బంగా బుధవారం ఆయన బషీర్బాగ్ లోని శ్రీ కనకదుర్గ శ్రీ నాగలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రిని ఘనంగా సన్మానించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక వైపు బతుకమ్మ, మరో వైపు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలతో నగరం మొత్తం కోలాహలం నెలకొందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాలతో అన్ని పండుగలను అధికారికంగా ఎంతో గొప్పగా ప్రజలు జరుపుకుంటున్నా రని చెప్పారు. రాష్ట్ర ప్రజల సంతోషమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాష్, శంకర్యాదవ్, ఆలయ కమిటీ చైర్మెన్ రామరాజు, సభ్యులు శ్రీశైలం (శ్రీను), అనిల్ కుమార్, రవీందర్, రమేష్ యాదవ్, సంతోష్గుప్తా, మాజీ కార్పొరేటర్ రామచందర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.