Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్కలెక్టరేట్
ప్రతి ఒక్కరూ మంచి మార్గంలో పయనించినప్పుడు తప్పకుండా వారిని విజయం వరిస్తుందని దీన్ని స్ఫూర్తిగా తీసుకుని అందరూ మంచి మార్గంలో పయనించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్ అన్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లోని ఛాంబర్లో కలెక్టర్ ఆయుధ పూజ నిర్వహించారు. దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా పూలమాలలు వేసి దుర్గా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దసరా (విజయ దశమి) పండగ సందర్భంగా విజయానికి ప్రతీకగా ఉండేందుకుగాను ఆయుధపూజలు నిర్వహిస్తారనీ, ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అన్నారు. దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని 9 రోజులపాటు దుర్గామాతను వివిధ అలంకరణలో పూజలు చేసి ఉపవాసదీక్షలు చేస్తారనీ, అనంతరం విజయదశమి (దసరా) రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు. పండగను ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని కలెక్టర్ హరీశ్ ఆకాంక్షించారు. దసరా పండగ రోజున జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కరోనా నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించడంతోపాటు శానిటైజర్లను తప్పకుండా ఉపయోగించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రతి ఒక్కరికీ కలెక్టర్ దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లిం గ్యానాయక్, ఆర్డీవోలు రవి, మల్లయ్య, కలెక్టరేట్ సిబ్బంది, ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.