Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్పేట్/సిటీబ్యూరో
ట్యాంక్ బండ్పై సందర్శకుల సందర్శన తరహాలో చారిత్రక చార్మినార్ ప్రత్యేక సందర్శకుల సందర్శనకు ఏర్పాట్లు సిద్ధం చేస్తు న్నారు. ప్రతి ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్ను నో వెహి కల్స్ జోన్తో సందర్శించడానికి ఏర్పాటు చేసిన మాదిరిగా చారిత్ర క చార్మినార్ను కూడా ప్రతి ఆదివారం సాయంత్రం నో వెహికల్ జోన్ సందర్శకుల సందడి చేసుకునేలా చూస్తున్నారు. దీనిపై పై 'సండే.. ఫన్ డే' కొనసాగిస్తున్నట్టుగానే పాతబస్తీలోని చార్మినార్ వద్ద కూడా నిర్వహిస్తే బాగుంటుందనే విషయాన్ని ఎంపీ అసదు ద్దీన్ ఒవైసీకి మంత్రి కేటీఆర్కు ట్విటర్ ద్వారా సూచించారు. ఈ విషయాన్ని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రధాన కార్యదర్శి అర్విందకుమార్ తన ట్విటర్ ద్వారా రీ ట్వీట్ చేసినట్టు అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ట్యాంక్బండ్పై ప్రతి ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కొనసాగిస్తున్న నో వెహికిల్ జోన్ కార్యక్రమాన్ని చార్మినార్ వద్ద కూడా చేపడితే బాగుంటుందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, ట్రాఫిక్ కమిషనర్ అధికారులతో కలిసి గురువారం చార్మినార్ చార్ కమాన్ సందర్శన ప్రాంతాలను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చార్మినార్ చారిత్రక ప్రత్యేకతో పాటు సాయంత్రం సందర్శించేందుకు వచ్చే నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించినట్టు అవుతుం దన్నారు. పాతబస్తీ ప్రజలతోపాటు నగరంలోని ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు చార్మినార్కు చేరుకుని కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో సరదాగా.. సంతోషంగా గడిపే అవకాశం ఉందన్నా రు. ఆ ప్రాంతానికి వచ్చే వారికి సాయంకాలం వాహనాలను మదీనా ప్రాంతం నుంచి దారి మళ్లించేందుకు ట్రాఫిక్ పోలీసులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.