Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్ వాసులకు హైదరాబాద్ మెట్రో రైల్ శుభవార్త చెప్పింది. పండుగల సీజన్ల నేపథ్యంలో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు మరోసారి సరికొత్త ఆఫర్లను ప్రకటిం చింది. గతేడాది దసరా పండుగ సందర్భంగా తీసుకొచ్చిన మెట్రో సువర్ణ ఆఫర్ను మరోసారి స్వల్ప మార్పులతో తీసుకొచ్చింది. అంతేగాక ప్రస్తుత ఆఫర్లతోపాటు నెలవారీగా లక్కీ డ్రా నిర్వహించి మెట్రో ప్రయాణికులకు బహుమతులు అందజేయాలని నిర్ణయించింది. ఈ ఆఫర్లు ఈనెల 18 నుంచి వచ్చే ఏడాది జనవరి 15వరకు అందు బాటులో ఉండనున్నాయి. ప్రతినెలా అయిదుగురు చొప్పున ప్రయాణికులను లక్కీ డ్రాలో ప్రకటించి బహుమ తులు అందజేయనున్నారు. మెట్రో ప్రయాణికులకు ఈ ఆఫర్లలో ట్రిప్ పాస్, గ్రీన్ లైన్ స్పెషల్ ఛార్జీ (జేబీఎస్ టు ఎంజీబీఎస్ కారిడార్), నెలవారీ లక్కీ డ్రా ఉన్నాయి.
ట్రిప్ పాస్..
ట్రిప్ పాస్ ఆఫర్ కింద మెట్రో ప్రయాణికులు కేవలం 20 ట్రిప్పుల ధర చెల్లించి ఏదైనా జోన్లో 30 ట్రిప్పులను కొనుగోలు చేయవచ్చు. దీంతో పది రోజుల ప్రయాణం అదనంగా లభించనుంది. ఈ ప్రయాణాలను 45 రోజుల్లో వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ ఆఫర్ మెట్రో స్మార్ట్ కార్డ్ (పాత-కొత్త కార్డులు) ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. మెట్రో ప్యాసింజర్స్ ఈనెల 18 నుంచి జనవరి 15 వరకు ఈ ఆఫర్ను పొందవచ్చు.
రూ.15తో మెట్రో ప్రయాణం..
మెట్రో రైల్కు సంబంధించిన గ్రీన్లైన్లో ప్రత్యేక చార్జిలు వర్తించనున్నాయి. ఎంజీబీఎస్- జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ల మధ్య గ్రీన్ లైన్లో ప్రతి ట్రిప్కు గరిష్టంగా రూ.15 మాత్రమే చెల్లించి ప్రయాణికులు జర్నీ చేయవచ్చు. మెట్రో ప్రయాణీకులు ఈ ఆఫర్ను అక్టోబర్ 18 నుంచి జనవరి 15 వరకు పొందవచ్చు. ప్రస్తుతం ఎంజీబీఎస్ టు జేబీఎస్ పరేడ్ గ్రౌండ్ రూట్లో ప్రయాణించే ప్యాసింజర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది. నాగోల్-హైటెక్ సిటీ, ఎల్బీనగర్-మియాపూర్ మార్గాలతో పోల్చి చూస్తే.. ఈ కారిడార్లో ప్రయాణికుల సంఖ్య తక్కువగా నమోదవుతుంది. కేవలం పది కి.మీ డిస్టెన్స్ కావడం, పాతబస్తీకి మెట్రో విస్తరించకపోవడంతో ఈ మార్గంలో మెట్రో ప్రయాణానికి జనం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దీంతో ఈ కారిడార్లో ప్రయాణికుల సంఖ్య పెంపే లక్ష్యంగా మెట్రో రైల్ ఈ ఆఫర్ను రూపొందించిందని చర్చ జరగుతోంది.
లక్కీ డ్రా..
మెట్రోలో నెలవారీ లక్కీ డ్రాలో భాగంగా ప్రయాణి కులకు అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఆకర్షణీయమైన బహుమతులు లభించనున్నాయి. దీంట్లో భాగంగా ప్రతి నెలా మెట్రో ప్రకటించిన విధంగా నెలలో స్మార్ట్ కార్డు ద్వారా కనీసం 20 సార్లు ప్రయాణించిన వారికి ఈ ఆఫర్ లభించనుంది. లక్కీ డ్రాలో భాగంగా ప్రతినెలా అయిదుగురు విజేతలను ప్రకటించనున్నారు. ప్యాసింజర్లు ఈ స్కీమ్కు అర్హులు కావాలంటే.. టీ-సవారీ యాప్ ద్వారా ప్రయాణం లేదా మెట్రో స్టేషన్లలో కాంటాక్ట్లెస్ స్మార్ట్ కార్డ్ తీసుకుని ఉండాలి. అంతేగాక నెలలో 20 సార్లు ప్రయాణించాల్సి ఉంటుంది.
సౌకర్యవంతమైన రవాణా మెట్రో :
ఎల్అండ్టీ మెట్రో సీఎండీ కేవీబీ రెడ్డి
ప్రజలు మెట్రోను సౌకర్యవంతమైన రవాణాగా భావిస్తున్నారు. మరోసారి సువర్ణ ఆఫర్ను ప్రారంభిం చడం సంతోషంగా ఉంది. కరోనా కాలంలో సురక్షితమైన భద్రతా ఏర్పాట్లు చేశాం.
నగదుకు తగ్గ విలువ : మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
మెట్రో ప్రయాణికులకు నగదుకు తగ్గ విలువను అందించడమే మా ప్రయత్నాం. సువర్ణ ఆఫర్ను మళ్లీ తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది.