Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రధాన పండుగ బతుకమ్మ, విజయ దశమి అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్, రంగా రెడ్డి ప్రజలందరికీ బతుకమ్మ, విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా బతుకమ్మ పండుగకు ఒక గుర్తింపు వచ్చిందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే అని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆమె కతజ్ఞతలు తెలిపారు. కరోనా మహమ్మారి పూర్తిగా పోయి తెలంగాణ ప్రజలు మళ్లీ సాధారణ స్థితికి రావాలని, కరోనాపై విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ప్రజలందరూ తాము కోరుకున్న కోరికలు నెరవేరి అన్నిట్లో విజయం సాధిం చాలని, ప్రతి ఒక్కరూ బంగారు తెలంగాణ దిశగా పనిచేయాలని, ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు.