Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్పేట
విజయదశమిని పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా శామీర్పేట గ్రామంలో రెడ్డి సంఘం నాయకులు
శుక్రవారం రెడ్డి సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి ముఖ్య అతిథులుగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి తనవంతు సహాయంగా 5లక్షల రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా మర్రి రాజశేఖర్రెడ్డి లక్ష పదివేలు, శామీర్పేట మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు విలాసాగరం సుదర్శన్ లక్ష రూపాయలు విరాళంగారెడ్డి సంఘం ప్రతినిధులకు అందజేశారు. అనంతరం దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శామీర్పేటలోని దుర్గాదేవి మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. శామీర్పేటలో ఎలక్ట్రానిక్ టూ వీలర్ షోరూం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి, జడ్పీటీసీ అనిత లాలి, ఎంపీపీ ఎల్లుబాయి బాబు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుదర్శన్, ఎంపీటీసీి సాయిబాబా, మూడుచింతలపల్లి మండల టీఆర్ఎస్్ పార్టీ అధ్యక్షులు మల్లేష్గౌడ్, సర్పంచ్ మోహన్ రెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, ఏఎంసి వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, రెడ్డి సంఘం నాయకులు సొసైటీ డైరెక్టర్ భూమిరెడ్డి, మాజీ డైరెక్టర్ నర్సింహారెడ్డి, లావణ్య నర్సింహారెడ్డి, వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, సొసైటీ వైస్ చైర్మెన్ ఐలయ్య యాదవ్, శామీర్పేట వార్డు సభ్యులు, గ్రామ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ రవి, మాజీ సర్పంచ్ కిషోర్ యాదవ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి మతిన్ బారు వాసు, గొలుసుల విష్ణు, శ్రీకాంత్ గౌడ్, లాలీ, బాబు, మైనార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.