Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
శరనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బతుకమ్మ పండుగ, దసర పండుగను పురస్కరించుకొని గురువారం దుర్గా మాతకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం కులమతాలకు అతీతంగా అన్ని వర్గాలకు చెందిన పండుగను జరుపుకోవటానికి ప్రొత్స హించటం జరుగుతుందని తెలిపారు. బడంగ్పేట్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బడంగ్పేట్, అల్మాస్గూడ గ్రామాల్లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మా రెడ్డి, కార్పొరేటర్ భీమిడి స్వప్న జంగారెడ్డి, పి.సుదర్శన్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.