Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
ట్యాంక్బండ్పై ప్రతి ఆదివారం నిర్వహిస్తున్నమాదిరిగానే పాతబస్తీ చార్మినార్ వద్ద నేటి ఆదివారం నుంచి ఇక ప్రతీ ఆదివారం 'ఏక్ షామ్ చార్మినార్ కేనామ్' పేరుతో సండే ఫన్డేగా హాలిడే స్పాట్గా నిర్వహించడానికి పోలీస్ అధికారులు ఏర్పాట్లుచేశారు. ట్యాంక్బండ్పైలాగే చార్మి నార్ వద్ద కూడా సందర్శకుల కోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ శనివారం తెలిపారు. ప్రతి ఆదివారం సాయంత్రం 5గంటల నుంచి అర్థరాత్రి వరకూ సండే ఫన్ డే కార్యక్ర మం కొనసాగుతుందన్నారు. ఈ సమయంలో చార్మినార్ పరిసరాల్లోకి వాహనాలను అనుమతించమన్నారు. అర్థరాత్రి వరకూ లాడ్బజార్ తెరిచి ఉంవుంటుదని, పిల్లలను, పెద్దలను ఆకట్టుకునే కార్యక్రమాలు, వివిధ రకాల ఫుడ్స్టాల్స్ సైతం అందుబాటులో వుంటాయని తెలిపారు. చార్మినార్వద్ద ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. నాలుగు ప్రదేశాల్లో సందర్శకుల కోసం పార్కింగ్ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు.