Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మల్కాజిగిరి
మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనై జేషన్ చైర్మెన్ (ఎంఎస్ఎస్ఓ) మైనంపల్లి రోహిత్ ఇంగ్లాండ్, యూరప్ పర్యటనలో భాగంగా యునైటెడ్ కింగ్డమ్లో అత్యంత ధనవంతులు ఉండే కెసింగ్టన్ అండ్ చెల్సి కౌన్సిల్లో మేయర్ జెరాడ్ హర్గర్వెస్ ఆహ్వానం మేరకు వారి సభ్యులతో కౌన్సిల్ విధివిధానాలు, వివిధ శాఖల పనితీరు, టెక్నాలజీ అవలం భించిన తీరుని ఈ పర్యటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ (ఏంఎస్ఎస్ఓ) చేపట్టిన స్వచ్చంద సేవా కార్యక్రమాలను మేయర్ జెరాడ్ హర్గర్వేస్ కొనియాడారు. కౌన్సిల్ తరుపున కావాల్సిన మేధోసంపత్తి సహాయం చేయడానికి ఎల్లవేళలా తమ సహాకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మల్కాజిగిరి నియోకవర్గం టీఆర్ఎస్ నాయకులు సీకా చంద్రశేఖర్, కౌన్సిలర్ ఉదరుఅరటి, యూకే తెలంగాణ బిజినెస్ ఛాంబర్, సీటీఓ సురేష్ గోపతి పాల్గొన్నారు.