Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
రావణ దహనం చేసే కార్యక్రమంలో బంజారాహిల్స్ కార్పొరేటర్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి దంపతులు బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక రావణ దహన కార్యక్రమంలో పాల్గొని విజయదశమి సంబరాల్లో విజయాన్ని తప్ప మరొకదాన్ని ఆశించకుండా ముందుకు సాగాలని ఆమె తెలిపారు. అభివద్ధిలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరం భారతదేశంలో ఎల్లవేళలా మొదటి స్థానంలోనే ఉంటుందని, ప్రజలందరూ మరికొన్ని నెలలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పండగలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్ డివిజన్ టీఆర్ఎస్ నాయ కులు, కార్యకర్తలు, మహిళలు భాగస్వాములయ్యారు.